నాగాయలంకలో కృష్ణా నదీతీరాన శ్రీ రామపాదక్షేత్రం ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా వారాహి గుప్త నవరాత్రులు మహోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం రాత్రి శ్రీ వారాహి అమ్మవారికి పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ రామపాదక్షేత్రం ఆలయాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.