బంటుమిల్లి మండలం ములపర్రులో అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీని ఆదివారం ఆర్ఐ శివశంకర్ సీజ్ చేశారు. అనంతరం వాటిని తహశీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో గంగాజలం, వీఆర్ఎ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.