విభిన్న రంగాల్లో సమాజానికి సేవలు చేస్తున్న యువత ఆదర్శనీయులని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గత కొన్నేళ్ళుగా దివిసీమ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వాతావరణ సమాచారం అందిస్తున్న చల్లపల్లికి చెందిన టాపీ మేస్త్రి కస్తూరి లంకేష్ ను మంగళవారం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డలోని తన కార్యాలయంలో అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఘంటసాల రాజమోహనరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.