వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 6వ రోజు మైలవరం, బాడవ, పుల్లూరు, దాసుల పాలెం, గ్రామాల్లో శనివారం ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఉపాధి చట్టం రక్షణ కోసం మే 20న ఉపాధి పనులు బంద్ చేయాలన్నారు. గ్రామ సచివాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.