మైలవరం: మే 20న ఉపాధి పనులు బంద్

69చూసినవారు
మైలవరం: మే 20న ఉపాధి పనులు బంద్
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 6వ రోజు మైలవరం, బాడవ, పుల్లూరు, దాసుల పాలెం, గ్రామాల్లో శనివారం ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఉపాధి చట్టం రక్షణ కోసం మే 20న ఉపాధి పనులు బంద్ చేయాలన్నారు. గ్రామ సచివాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్