గన్నవరం: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన నిర్వహించదలచిన సమ్మెను జయప్రదం చేయాలని సి. ఐ. టి. యు జిల్లా కార్యదర్శి కళ్ళం వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సి. ఐ. టి. యు కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని, పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.