ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ శర్మ గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం పిన్నమనేని సిద్ధార్థ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుతుండగా భాస్కర్ శర్మ వాహనం వెనుక కూర్చున్నారు. తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.