గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్య పరీక్షలు నిర్వహించి ఆసుపత్రిలో చికిత్స అందించాలని వంశీ తరుపు న్యాయవాదులు శనివారం కోర్టు లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.న్యాయస్థానం తీర్పును అనుసరించి వంశీని ఎక్కడకి తరలించనున్నారో వేచి చూడాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వంశీ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని ఆరోపణల తో నమోదైన కేసులో 29వ తేదీ వరకు రిమాండ్ ఖైదీ గా వంశీ ఉన్నారు అనే విషయం విదితమే.