ఏపీ సీఎంను కలిసేందుకు వచ్చేవారికి అధికార పార్టీ నేతలు కీలక సూచనలు చేశారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రజల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కు రూపొందించారు. ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్: 7306299999ను సంప్రదించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఈ నెంబర్ కు వచ్చిన ఫిర్యాదును పరిశీలించి ముఖ్యమంత్రి వద్దకు పంపిస్తారని పేర్కొన్నారు.