కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బిళ్లనపల్లికి చెందిన రామతులశమ్మ బతికే ఉన్నారు. కానీ ప్రభుత్వ దస్త్రాల్లో ఆమెను చనిపోయినట్లుగా నమోదు చేయడంతో రేషన్ కార్డుతో పాటు ఇతర పథకాలను ఆమె పొందలేకపోతున్నారు. భర్త మరణించిన సమయంలో అధికారులు పొరపాటుగా ఆమెను కూడా మృతురాలిగా నమోదు చేశారు. ఈ విషయం తాజాగా అధికారుల దృష్టికి వెళ్లింది.