హజ్ యాత్రను ముగించుకొని ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చిన హజ్ యాత్రికులను, బుధవారం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ హాజయాత్రికులకు ఎటువంటి కష్టం రాకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా, వారికి కావాల్సిన సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.