ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) అందించిన సాహిత్య సేవలు, చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా కలెక్టర్. లక్ష్మీశ అన్నారు. తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవయిత్రి మొల్ల జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ముఖ్య అతిదిగా హాజరై ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.