గన్నవరం రైతు బజార్ లో గురువారం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బియ్యం కందిపప్పు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు. కేజీ బియ్యం 48 రూపాయలు, కందిపప్పు 160 రూపాయలు కె ప్రజలకు అందజేశారు. గన్నవరం, హనుమాన్ జంక్షన్ రైతు బజార్లో ఈ స్టాల్స్ ని ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. గన్నవరం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానన్నీ యార్లగడ్డ అన్నారు.