కాలువల్లో జరిగే అభివృద్ధి పనులను ఎక్కడికక్కడ రైతులు దగ్గరుండి పర్యవేక్షించాలని గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. గురువారం కాలువల్లో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి చానల్స్ అభివృద్ధికి రూ. 1. 58కోట్లు, మురుగునీటి డ్రెన్లలో తూడు, కాడ తొలగింపుకు రూ. 90. 30 లక్షలు నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.