గుడివాడ పట్టణం 11వ వలివర్తిపాడు రోడ్డులో వార్డు టీడీపీ ఇన్ ఛార్జ్ సయ్యద్ జబీన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. వైద్య శిబిరంలో పరీక్షలు చేపించుకున్న వారిలో అవసరమైన వారికి ఉచితంగా శాస్త్ర చికిత్సలు కూడా చేస్తామని సయ్యద్ జబీన్ అన్నారు. ఈ వైద్య సూత్రంలో కళ్ళజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ హన్ను, షేక్ కరీముల్లా, పట్టపు చిన్న, రబ్బాని, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.