గుడివాడ: ప్రజా దర్బార్ లో అర్జీలు స్వీకరణ

62చూసినవారు
ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ 29వ వార్డులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ఇతర అధికారులు, కూటమి నేతలతో కలిసి సచివాలయంలో ఎమ్మెల్యే రాము ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్