గుడివాడ: ముస్లిం సోదరుల నిరసన ర్యాలీ

84చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం గుడివాడ పట్టణం ముబారక్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ముస్లిం సోదరులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్