నందివాడ మండలం ఇలపర్రు శివారు లక్ష్మీనరసింహాపురం గ్రామంలో అకాల వర్షం కారణంగా ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి నీళ్లు ఉండడంతో అటువైపుగా ప్రయాణం చేసే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో నాయకులు తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ ఈ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరుతున్నారు.