డ్రోన్ కెమెరాలతో క్షేత్రస్థాయిలో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగం ఆకతాయిల ఆట కట్టిస్తుంది. శుక్రవారం నందివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూతులపాడు గ్రామ శివారులో పేకాట నిర్వహిస్తున్నారని డ్రోన్ కెమెరా పరిశీలనలో గుర్తించారు. ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది మెరుపు దాడి చేసి పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోనికి తీసుకొని, రూ.2,700ల నగదు స్వాధీనం చేసుకున్నారు.