ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ రాజ శేఖర బాబు అదేశాలతో నగరంలో పలు ప్రదేశాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 5వ ట్రాఫిక్ పోలీసులు మొత్తం 29 మందిని మద్యం సేవించి వాహనాలు నడిపుతున్న వారిని గుర్తించి, 8వ అడిషనల్ మెట్రో పాలిటన్ కోర్ట్ లో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వారిలో 11మందికి రూ. 15, 000/- చొప్పున మిగిలిన 18 మందికి ఒక్కొక్కరికి రూ. 10, 000/- చొప్పున జరిమానా విధించారు.