వత్సవాయిలో చెరువు అభివృద్ధి పనులకు భూమి పూజ

65చూసినవారు
వత్సవాయిలో చెరువు అభివృద్ధి పనులకు భూమి పూజ
వత్సవాయి మండలం పెట్యాల వారి గూడెం గ్రామంలో చెరువు అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం గురువారం నిర్వహించారు. శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) భూమి పూజ చేసి పనులు ప్రారంభించామన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. రాబోయే వర్షాకాలం నాటికి రైతులకు చెరువు పూర్తి చేసి సాగు నీరు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్