పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులోని సచివాలయంలో శుక్రవారం కిషోర బాలికల కార్య క్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 11 నుంచి 18 సంవత్సరాల బాలికలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించామన్నారు. చిన్న వయసులో వివాహం చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించారు. ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని తెలిపారు.