ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభానుని ఉరుసు ఉత్సవాలకు కమిటీ సభ్యులు ఆహ్వానించారు. గురువారం జగ్గయ్యపేటలోని జనసేన కార్యాలయంలో సామినేని ఉదయభానుని కలిసి కొండపల్లిలోని ప్రముఖ సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో జరుగబోవు సుప్రసిద్ద హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా వారి 428వ ఉరుసు మహోత్సవంకి అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందించారు.