అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురికావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. ఇటువంటి సంఘటన జరగడం చాలా విషాదకరమని ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు. గాయపడ్డ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.