జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన ఉచిత కబడ్డీ కోచింగ్ క్యాంపును ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ తాతయ్య శనివారం ప్రారంభించారు. క్రీడా శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. చదువుతో పాటు ఆటల్లోవబ రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు తమ క్రీడా ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు. అనంతరం ఆయన వారితో కలిసి కాసేపు కబడ్డీ ఆడారు.