జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జయప్రద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని ప్రజలు ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.