జగ్గయ్యపేట పట్టణం పరిధిలోని కోదాడ రోడ్డులో గల మార్కెట్ యార్డులో అమరుడైన మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం రైతులు, కూటమి నాయకులతో కలిసి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ.. మురళి నాయక్ ప్రాణత్యాగాన్ని దేశం గుర్తుపెట్టుకో ఉంటుందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.