జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం పుస్తకాలు, ఫీజులు, యూనిఫాంల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తోంది. వేలాది రూపాయలు అడ్డగోలుగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. విద్యార్ధుల తల్లితండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలనే మోజులో నానా అవస్ధలు పడి వేలాది రూపాయలు చెల్లిస్తున్నారు.