కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. వత్సవాయి మండలం లింగాల గ్రామ సచివాలయ కన్వీనర్ అంబోజి వెంకటకృష్ణ గత ఫిబ్రవరిలో మృతి చెందారు. సచివాలయ కన్వీనర్లకు భీమా సదుపాయం కల్పించడంతో మృతుడు కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉదయభాను కృషి ఫలితంగా 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. భీమా చెక్కును గురువారం అంబోజీ కృష్ణ కుటుంబసభ్యులకు అందజేశారు.