చేవూరు రహదారికి టీడీపీ నాయకులు మరమ్మతులు

72చూసినవారు
చేవూరు రహదారికి టీడీపీ నాయకులు మరమ్మతులు
అధ్వానంగా మారిన సింగరాయపాలెం నుంచి వడ్లమన్నాడు వెళ్లే రహదారికి టీడీపీ నాయకులు మరమ్మతులు నిర్వహించారు. చేవూరు నుంచి చెన్నూరు వరకు పెద్దపెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఈ గుంతల వల్ల మచిలీపట్నం నుంచి సింగరాయపాలెం వచ్చే ఆర్టీసీ బస్సును మూడు రోజుల పాటు నిలిపివేశారు. ఎమ్మెల్యే కామినేని సూచనల మేరకు గురువారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో పొక్లెయిన్ తో మరమ్మతులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్