కొల్లేరు పెదవకలంక నుండి సిద్ధాంతం వరకు కొల్లేరు గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా రహదారిని తక్షణమే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని నిర్మించాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఏలూరు జిల్లా కైకలూరు- పెనుమాక లంక గ్రామంలో మూడు నాలుగు గ్రామాలు చెందిన కొల్లేరు పెద్దల సమావేశం పెనుమాక లంక గ్రామ సర్పంచ్ నాగరాజు అధ్యక్షతన జరిగింది.