పుట్టింటి నుంచి నగదు తీసుకు రమ్మని అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారని వివాహిత పోలీసులను ఆశ్రయించింది. పెయ్యేరుకి చెందిన లతకు ముదినేపల్లికి చెందిన మణికాంతక్కు అయిదేళ్ల క్రితం వివాహమైంది. అప్పుడు కట్నంగా కొంత నగదు ఇచ్చారు. గత కొంతకాలంగా ఆమెకు పుట్టింటి నుంచి మరికొంత నగదు తీసుకురావాలని భర్త, అత్త వేధిస్తున్నారని బుధవారం ఫిర్యాదు చేయగా ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.