ముదినేపల్లి పోలీస్ స్టేషన్ లో ఆదివారం అంబేడ్కర్ జయంతి వేడుకలపై నిర్వాహకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ మాట్లాడుతూ వేడుకలు శాంతియుతంగా జరగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విగ్రహం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎస్ఐ వీరభద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.