ముదినేపల్లి మండలం ఊటుకూరులో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రసన్న వెంకటేశ్వరస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఇందులో భాగంగా నిత్యహోమము, పూర్ణాహుతి, శ్రీచక్రస్నానం (వసంతోత్సవం) నిర్వహించారు. రాత్రికి పవళింపు సేవ నిర్వహించారు. గెడ్డం మల్లికార్జునరావు భక్త బృందం నిర్వహించిన భగవద్గీత పారాయణం ఆకట్టుకుంది. యాజ్ఞిక బ్రహ్మ ఆసూరి రంగనాథాచార్యులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.