ముదినేపల్లి మండలంలోని 67 ప్రభుత్వపాఠశాలలో ఈ నెల 8న నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికకు అర్హులైన ఓటర్ల జాబితాను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గురువారం ప్రదర్శించారు. అంతకుముందు ఉదయం నోటిఫికేషన్లు ప్రచురించారు. ఎమ్యీవో నరేశ్ కుమార్ మాట్లాడుతూ. ఎన్నికలు నిష్పక్షపాతంగా ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని తెలిపారు. అభ్యంతరాలు స్వీకరించి 5న తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించాలన్నారు.