ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోని పలు గ్రామాల్లో అల్పపీడనం వల్ల ఆదివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు దుమ్ము ధూళితో కూడిన ఈదురు గాలులు వీయటంతో పూరి గుడిసెలలో నివసించే ప్రజలు భయాందోళన చెందారు. సుమారు 20 నిమిషాల పాటు వర్షంతో పాటు ఈదురు గాలులు వీయటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.