మచిలీపట్నం నుండి బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ చంద్రయ్యకు హైకోర్టు శనివారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అకారణంగా విధుల నుండి సస్పెండ్ చేసిన ఆర్ఓ వెంకటేష్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ. 2వేలు జరిమానా విధించింది.