మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో శుక్రవారం కానిస్టేబుల్ అభ్యర్థులకు 10వ రోజు దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. పరీక్షలకు పురుష అభ్యర్థులు 350 మంది హాజరయ్యారని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు మచిలీపట్నంలో తెలిపారు. వీరిలో 104 మంది డిస్ క్వాలిఫై అయ్యారని, హాజరైన వారిలో 236 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని జిల్లా ఎస్పీ తెలిపారు.