కృష్ణా: తీర ప్రాంత భద్రత మరింత పటిష్ట పరచండి

82చూసినవారు
కృష్ణా: తీర ప్రాంత భద్రత మరింత పటిష్ట పరచండి
తీర ప్రాంత భద్రత మరింత పటిష్ట పరచాలని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లకుండా జిల్లావ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. శుక్రవారం జిల్లా ఎస్పీ గిలకలదిండి సముద్ర తీర ప్రాంతాన్ని సందర్శించి, గిలకలదిండి న్యూ ఫిషింగ్ హార్బర్ నుండి పడవ ద్వారా మెరైన్ పోలీసులతో కలిసి మొగ వరకు వెళ్లి అక్కడి రక్షణా పరిస్థితులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్