కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబూ ఇంటిపై కొందరు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని అబూ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించి, ధ్వంసమైన ఫర్నిచర్ను పరిశీలించారు. కొందరు తమ ఇంటి వద్ద ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారని అబూ తల్లి బేగం పేర్ని నానికి వివరించగా, ఆయన గుడివాడ డీఎస్పీకి ఘటనపై ఫిర్యాదు చేశారు.