ప్రజా సమస్యల పరిష్కారానికి మరొక ముందడుగు వేసినట్టు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. శనివారం మచిలీపట్నంలోని డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం పోలీస్ శాఖ యొక్క ప్రథమ బాధ్యత అని, 'డయల్ యువర్ ఎస్పీ' ద్వారా ప్రజలకు నేరుగా న్యాయం కల్పించడమే మా లక్ష్యమన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామన్నారు.