మచిలీపట్నం పెద్దకరగ్రహారం జనసైనికుడిపై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మూకుమ్మడి దాడి చేశారు. అక్రమంగా మట్టి రవాణాపై మండల తహసీల్దార్ కు ఫిర్యాదు చేయడంతో కోపోద్రికులైన మట్టి దందా నిర్వాహకులు జనసైనికుడు మట్ట వెంకట రాంబాబుపై 20 మంది వ్యక్తులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. బాధితుడికి గాయాలయ్యాయి. బాధితుడు, దాడికి పాల్పడిన వ్యక్తులు ఒకే పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.