మచిలీపట్నంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎ.కొండూరుకు చెందిన దారావత్ 15046039 చంద్రశేఖర్ (25) మృతి చెందడంపై పోలీసులు వివరణ ఇచ్చారు. కార్డియాటిక్ అరెస్ట్తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారన్నారు. ప్రాథమికంగా పరీక్షలు చేసిన రిపోర్టుల్లో అతనికి SEPSIS కారణంగా WBC కౌంట్ 30వేలకు చేరిందన్నారు. అతను గత 5 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు.