కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం అర్థరాత్రి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులపై వాహనాలను తనిఖీలు చేపట్టారు. మచిలీపట్నం బైపాస్ రహదారిపై సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న లారీలను ఆపి రికార్డులను తనిఖీ చేశారు. భారత్ పాకిస్తాన్ పై దాడులు జరుపుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై బస్టాండులు, రైల్వేస్టేషన్ లు తనిఖీ చేస్తున్నారు.