మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ ఉద్యోగులకు రూ. 10 లక్షల విలువైన 1250 డస్ట్ బిన్స్, రూ. 10 లక్షల విలువైన తోపుడు బండ్లు శనివారం రాత్రి పంపిణీ చేశారు. ప్రజలకు సేవ అందించే వారికి తోడుగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అన్నారు. జనసేన నాయకులు బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.