విసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లిలో శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కాలువ గట్టు వద్ద 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. సారా తయారీకి బెల్లం ఊటను సిద్ధం చేస్తున్న బాణావతు రవిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అసాంఘిక చర్యలను సహించబోమని అధికారులు హెచ్చరించారు.