ఇబ్రహీంపట్నం: వాల్టా చట్టం కింద కొత్త కమిటీని నియమిస్తాం

80చూసినవారు
ఇబ్రహీంపట్నం: వాల్టా చట్టం కింద కొత్త కమిటీని నియమిస్తాం
ఎన్టీటీపీఎస్ కాలుష్య నివారణకు వాల్టా చట్టం కింద కొత్త కమిటీని నియమించనున్నట్లు ఇబ్రహీంపట్నం తహశీల్దార్ వై. వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్టీటీపీఎస్ వల్ల గాలి, నీరు కలుషితం అవుతున్నాయన్న విషయాన్ని ధ్రువీకరించేందుకు చట్టం కింద సమావేశాలు నిర్వహించాలని కోరుతూ కొండపల్లికి చెందిన భద్రయ్య పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం స్పందించిన తహశీల్దార్.. కొత్త కమిటీని ఏర్పాటు చేసి కలెక్టర్ ఆమోదం పొందాక వాల్టా చట్టం కింద సమావేశం నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్