కొండపల్లి మున్సిపాలిటీకి విచ్చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను అఖిలపక్ష ప్రతినిధులు శుక్రవారం కలిశారు. మున్సిపాలిటీలో మెయిన్ రోడ్డును విస్తరించాలని కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, వామపక్ష, స్థానిక పెద్దలు వినతిపత్రం అందజేశారు. వారం రోజుల్లోనే రోడ్డు విస్తరణకు అధికారులతో మాట్లాడి శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు డీసీసీ అధ్యక్షుడు బొర్రా కిరణ్ తెలిపారు.