ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ పార్టీలోకి ప్రముఖ న్యాయవాది

69చూసినవారు
ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ పార్టీలోకి ప్రముఖ న్యాయవాది
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంకు చెందిన న్యాయవాది వల్లభనేని నాగపవన్ కుమార్ గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో మైలవరం నియోజక వర్గానికి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా, మచిలీపట్నానికి స్వతంత్ర పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఇప్పటి వరకు ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్