ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో ఓ మహిళ ఇళ్ల వద్దకు వెళ్లి తలుపులు బాదటంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు మతిస్తిమితం లేదని, హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిందని పోలీసులు తెలిపారు.