విజయవాడ కార్పొరేషన్కు సంబంధించిన చెత్తను కొండపల్లి కొత్తగేటు నివాసాల మధ్య తరలిస్తుండగా శుక్రవారం స్థానికులు అడ్డుకున్నారు. ఇటీవల విజయవాడలో వరదల కారణంగా ఏర్పడిన చెత్తను సేకరించి నిల్వచేసినట్లు సమాచారం. దాని తరలింపును అధికార పార్టీకి చెందిన ఓ నేత కాంట్రాక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వార్డు కౌన్సిలర్ శ్రీనివాసరావు, స్థానికుల ఫిర్యాదుమేరకు కమిషనర్ రమ్య కీర్తన అక్కడికి చేరుకొని చెత్త లారీలను వెనక్కి పంపించారు.